న్యూయార్క్: భారత్కు చెందిన బిలియనీర్ గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై పెట్టిన లంచాల క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా న్యాయ శాఖ గట్టిగా సమర్థించుకుంది. అంతేకాకుండా ఈ విచారణ చట్టపరంగా లోపభూయిష్టంగా ఉందని, దౌత్య పరంగా ప్రతికూలమైనదని, ట్రంప్ యంత్రాంగం అమలు ప్రాధాన్యతలకు విరుద్ధంగా ఉందని ఫెడరల్ న్యాయమూర్తికి తెలిపింది.
పదునైన పదజాలంతో సమర్పించిన ఫైలింగ్లో ‘దీనిని ఏడాది క్రితమే ఉపసంహరించాల్సి ఉంది లేదా అసలు దీన్ని అసలు ప్రవేశపెట్టి ఉండకూడనిది’ అని న్యాయ శాఖ (డీవోజే) వాదించింది.