UNRWA | గతేడాది ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో ఐక్యరాజ్య సమితి ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ సిబ్బంది భాగస్వామ్యంపై మరికొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ప్రభుత్వానికి అందిన నివేదిక వివరాలను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించింది. ఖాన్ యూనిస్లో ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ స్కూల్ ఉపాధ్యాయుడు, అతడి కొడుకు కలిసి ఇజ్రాయెల్ మహిళను కిడ్నాప్ చేసినట్లు ఈ నివేదిక సారాంశం.
‘గాజాకు ఇజ్రాయెల్ సైనికుడి మృతదేహం తరలించడానికి నుసైరాత్ అనే సోషల్ యాక్టివిస్ట్ పని చేశాడు. దాడి జరిగిన రోజు మందుగుండు సప్లయ్, వాహనాల మధ్య సమన్వయం బాధ్యతలను ఈ కార్యకర్త పర్యవేక్షించాడు. బేరీ కిబుట్జ్ నరమేధంలో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మరో ఉద్యోగి పాల్గొన్నారు’ అని ఆ నివేదిక తెలిపింది.
హమస్ దాడిలో పాల్గొన్న 12 మంది ఉద్యోగుల వివరాలు, యూఎన్ఆర్డబ్ల్యూఏలో వారి స్టేటస్ను ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ సంస్థలో పది మంది ఉద్యోగులు హమాస్ సంస్థలో సభ్యులుగా ఉన్నారని, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్’కు చెందిన వ్యక్తి అని పేర్కొంది. ఆయా సభ్యులు, ఉద్యోగుల ఫోన్ కాల్స్, టెక్ట్స్ సందేశాల ఆధారంగా ఈ డేటా సేకరించినట్లు తెలుస్తున్నది. పాలస్తీనాలో లక్షల మంది శరణార్థులను యూఎన్ఆర్డబ్ల్యూఏ సేవలు అందిస్తున్నది.