హైదరాబాద్: ఉక్రెయిన్పై పదోరోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఖేర్సన్ నగరంతో అణువిద్యుత్ కేంద్రాలైన చెర్నోబిల్, జపోరిజియా పవర్ ప్లాంట్ను తమ ఆధీనంలో తీసుకున్న రష్యా.. తాజాగా మరో పోర్టు సిటీపై పట్టు సాధించింది. రేపు పట్టణమైన మరియుపోల్ను (Mariupol) రష్యా బలగాలు చుట్టుముట్టాయని నగర మేయర్ తెలిపారు. మరియుపోల్ను రక్షించుకోవడానికి ఉక్రేనియన్ సైన్యాలు రష్యా బలగాలతో పోరాడుతున్నాయని చెప్పారు.
జపోరిజియా పవర్ ప్లాంటు స్వాధీనంతో రష్యా తన ఆక్రమణ పర్వంలో ఒక దశను విజయవంతంగా పూర్తి చేసినైట్టెంది. భౌగోళికంగా ఉక్రెయిన్లో ఒక భాగాన్ని పూర్తిగా వశపర్చుకొన్నది. తూర్పు ఉక్రెయిన్లో నీపహ్ నది చాలా కీలకమైనది. ఇది దేశాన్ని రెండుగా విభజిస్తున్నది. ఈ రెండు భాగాల మధ్య వారధిలా ఉన్నది జపోరిజియా పవర్ ప్లాంటు మాత్రమే. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉక్రెయిన్ నుంచి తూర్పు భాగాన్ని పూర్తిగా వేరు చేసింది. ఉక్రెయిన్ నియంత్రణ నుంచి తప్పించింది.