ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంపై రష్యా దాడి చేయడంతో ఉక్రెయిన్ మళ్లీ పుట్టిందని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. సోవియట్ యూనియన్ నుంచి స్వతంత్రం పొంది 31 ఏళ్లు నిండిన సందర్భంగా ఆ దేశంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన ప్రసంగాన్ని రికార్డు చేసిన జెలెన్స్కీ.. ‘‘రష్యా ఇలా దాడి చేయడంతో మన ఉక్రెయిన్ మళ్లీ పుట్టింది.
రష్యాకు భూభాగం కలిసొచ్చే ఎలాంటి ఒప్పందమైనా సరే ఉక్రెయిన్ వ్యతిరేకిస్తుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడని పాశ్చాత్య దేశాలు జెలెన్స్కీని కొనియాడుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం సమయంలో దేశం విడిచి పారిపోకుండా.. అక్కడే ఉండి రష్యాతో పోరాడుతున్నాడీ 44 ఏళ్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు.