స్వాతంత్ర్య దినోత్సవం నాడు రష్యా దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. సోవియట్ పాలన నుంచి స్వతంత్రం వచ్చి 31 ఏళ్లయిన సందర్భంగా ఈనెల 24న జరగనున్న ఈ వేడుకలపై రష్యా మరింత క్రూరమైన, దారుణమైన దాడులు చేయొచ్చని జెలెన్స్కీ చెప్పారు.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్లో బుధవారం నాడు పూర్తిగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు. తమ దేశంలో రష్యా మరింత విధ్వంసాన్ని, భయాన్ని పెంపొందించకుండా ఉక్రేనియన్లు అడ్డుకోవాలని సూచించారు.