కీవ్, జనవరి 9: రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ భారీగా నష్టపోయిందని, నష్టపోతూనే ఉందని ఉక్రెయిన్ దేశీయ వ్యవహారాల శాఖ మాజీ హెడ్ యురియ్ లుట్సెంకో వెల్లడించారు. ఒక యూ ట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు షాకింగ్ విషయాలు తెలిపారు.
2022 ఫిబ్రవరిలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ నెలకు 30 వేల మంది చొప్పున సుమారు 5 లక్షల మంది సైనికులను నష్టపోయిందన్నారు.