మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై దాడి జరిగింది. సుమారు 400 డ్రోన్లతో ఉక్రెయిన్(Ukrainian Drones) అటాక్ చేసినట్లు తెలుస్తోంది. మాస్కోతో పాటు సమీప ప్రాంతాలపై ఆ దాడి జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ అటాక్లో 10 మంది మృతిచెందారు. దీంట్లో ముగ్గురు చైనీయులు ఉన్నట్లు మాస్కో గవర్ననర్ ఆండ్రే వోరోబొయోవ్ తెలిపారు. మాస్కో నగరంపై సుమారు 400 యూఏవీలుతో దాడి చేశారని మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. రష్యా వైమానిక రక్షణ దళం వాటిని అడ్డుకున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి 8.30 నిమిషాల నుంచి సోమవారం 5 గంటల వరకు ఆ అటాక్ జరిగినట్లు చెబుతున్నారు. చాలా దూరంలోనే ఎక్కువ సంఖ్యలో డ్రోన్లను కూల్చివేశామని, మాస్కో నగరంపైకి వచ్చిన 85 యూఏవీలను ధ్వంసం చేశామని ఆ నగర మేయర్ తెలిపారు.