యుద్ధ బీభత్సంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా? అని అక్కడి వాళ్లంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఒక భారతీయ విద్యార్థిని మాత్రం అలా చేయలేదు. తన పెంపుడు కుక్క ‘జైరా’ను కూడా స్వదేశం తీసుకురావాలని పట్టుబట్టింది. ఇది చూసిన తెలిసి ఫోన్ చేసిన తల్లిదండ్రులకు కూడా అదే విషయం చెప్పింది.
‘‘జైరా లేకుండా నేను తిరిగి రావడం జరగదు’’ అని స్పష్టం చేసింది. ఆ తర్వాత జైరాను భారత్కు తీసుకొచ్చేందుకు కావలసిన పేపర్ వర్క్ చేస్తూ తిరిగింది. చివరకు తన శునకంపై ఆమె ప్రేమ గెలిచింది. ఎయిర్పోర్టులో తన పెట్తో కలిసి ఆమె ఉన్న ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఆమె పేరు ఆర్యా ఆల్డ్రిన్. కేరళలోని ఇడుక్కి ఆమె స్వస్థలం. ఆర్య జంతుప్రేమ గురించి తెలిసిన కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి ఆమె ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేశారు.
‘‘రణక్షేత్రంగా మారిన దేశంలో తన పెంపుడు శునకాన్ని వదలకుండా ఆర్య ఇంటికి వస్తోంది. ఆమె పట్టుదల ప్రేమ నుంచి పుట్టింది. ఇలాంటి ప్రేమ వల్ల ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని పోస్టు చేశారు. ఆర్య ప్రేమను నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.