కీవ్ : ఉక్రెయిన్పై రష్యా దాడుల తీవ్రత తగ్గిందని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రష్యా తమ సైనిక, పౌర స్ధావరాలపై దాడులు కొనసాగిస్తున్నా మాస్కో సైనిక చర్య లక్ష్యాలను నెరవేర్చేందుకు రష్యా ఆక్రమణదారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఉక్రెయిన్ బ్రిగేడ్స్ శత్రువు సైనిక పరికరాలు, సైనికులను దెబ్బతీశాయని అన్నారు.
రష్యా వైపు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, శత్రు బలగాలు నైతికస్ధైర్యాన్ని కోల్పోయాయని స్ప్టం చేశారు. ప్రచారార్భాటానికి, వాస్తవ పరిస్ధితికి వ్యత్యాసం ఉంటుందని రష్యా గుర్తెరిగిందని అన్నారు. దండయాత్రతో దాడులకు తెగబడ్డ మాస్కో ఇప్పుడు ఉక్రెయిన్ను చూసి భయపడుతునయ్నారని ఆ ప్రకటన పేర్కొంది.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మాస్కో దళాలు బెర్డియాన్స్స్, ఎనర్గోడార్ను ఆక్రమించాయి. జాపొరోజీ అణువిద్యుత్ ప్లాంట్ రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఉక్రెయిన్ గగనతలంపై పట్టు సాధించామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.