న్యూఢిల్లీ, జూలై 28: యూకో బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.223 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.124 కోట్లతో పోలిస్తే 80 శాతం అధికం. బ్యాంక్ ఆదాయం రూ.3,797 కోట్ల నుంచి రూ.5,857 కోట్లకు చేరుకున్నది.
దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.3,851 కోట్ల నుంచి రూ.5,224 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.42 శాతం నుంచి 4.48 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 2.49 శాతం నుంచి 1.18 శాతానికి దిగొచ్చింది. అయినప్పటికీ మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.389 కోట్ల నిధులను వెచ్చించింది.