యునైటెడ్ అరబ్ ఎమిరేట్(యూఏఈ) దేశాలకు ట్రిప్కు వెళ్లాలనుకునే ఇండియన్స్కు ఇదే సరైన సమయం. కోవిడ్ 19 తర్వాత ట్రావెల్ ఆంక్షలను యూఏఈ ఎత్తేసింది. దీంతో భారత్తో పాటు.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగండా, సియెరా లియోన్, లిబెరియా, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల నుంచి అరబ్ దేశాలకు వచ్చే టూరిస్టులకు పర్మిషన్ ఇచ్చేసింది. సెప్టెంబర్ 12 నుంచి ఆయా దేశాలకు చెందిన టూరిస్టులు యూఏఈకి వెళ్లొచ్చు.
ఈనేపథ్యంలో ఇండియా, దుబాయ్ రూట్లో వెళ్లే విమానాలు కొన్ని రోజుల పాటు రద్దీగా కనిపించనున్నాయి. కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావడంతో.. ఇప్పుడిప్పుడే ఆంక్షలు కూడా తొలుగుతుండటంతో ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో విమాన టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయని అంతా భావించినా.. ఇండియా నుంచి దుబాయ్ రిటర్న్ టికెట్ల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
భారత్ నుంచి దుబాయ్కి రిటర్న్ టికెట్ ధర కేవలం 13 వేల రూపాయల నుంచే ప్రారంభం అవుతోంది. అందుకే.. ఇండియన్ టూరిస్టులకు దుబాయ్ వెళ్లడానికి ఇదే బెస్ట్ టైమ్. తక్కువ ఖర్చుతో దుబాయ్ని చుట్టి రావచ్చు. ఎథిహాద్ ద్వారా నడుస్తున్న ఇన్డైరెక్ట్ విమానాల్లో 13 వేల రూపాయల నుంచే టికెట్ల ధరలు ప్రారంభం కానున్నాయి. కాకపోతే మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది. అదే స్పైస్ జెట్ అయితే.. కేవలం 22000 రూపాయలకే డైరెక్ట్ దుబాయ్ ఫ్లైట్ రిటర్న్ టికెట్ను అందిస్తోంది.
పూర్తిగా వ్యాక్సినేషన్ వేసుకున్న ప్రయాణికులకే దుబాయ్ టూరిస్ట్ వీసాను అందిస్తోంది. ప్రస్తుతం యూఏఈ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత వారంలో వెయ్యి కేసులు కూడా నమోదు కాలేదు. యూఏఈ దేశాల్లో 92 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ను అందించారు. మాల్టా తర్వాత ఎక్కువ శాతం వ్యాక్సినేషన్ అందించింది అక్కడే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పాత డ్రమ్ములు, టైర్లను రీసైకిల్ చేయడం యూట్యూబ్లో చూసి నేర్చుకొని రూ. కోటి సంపాదించాడు
ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన గడియారం ఇది.. విశ్వం గురించి చెబుతున్నదేంటి?
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?