బీజింగ్: చైనాలోని పోర్టు నగరం క్వింగ్డావోలో కార్గో షిప్(Cargo Ship)లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 20 మంది చనిపోయారు. మరో అయిదు మంది మిస్సింగ్లో ఉన్నారు. క్వింగ్డావో బెయ్హయ్ షిప్ బిల్డింగ్ యూనిట్లో రిపేర్ అవుతున్న కార్గో షిప్లో భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సమయంలో ఆ షిప్లో 42 మంది ఉన్నారు. 12 మందిని సురక్షితంగా తరలించారు. 5 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉన్నది. షిప్యార్డ్లో స్థానిక కాలమానం ప్రకారం 11.15 నిమిషాలకు ప్రమాదం జరిగింది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులను దర్యాప్తు చేసి, బాధితులకు తక్షణమే సపోర్టు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.క్వింగ్డావ్ షిప్యార్డులో కమర్షియల్ నౌకలను నిర్మిస్తుంటారు. షిపర్ రిపేర్, ఆఫ్షోర్ ఇంజినీరింగ్ కూడా నిర్వహిస్తారు. తీరం వెంట సుమారు 330 హెక్టార్లలో ఆ షిప్యార్ట్ ఉన్నది.