Today History: జపాన్లో సునామీ విపత్తు సంభవించి ఇవాల్టికి సరిగ్గా 11 ఏండ్లు పూర్తయ్యాయి. సునామీ సృష్టించిన విధ్వంసంలో దాదాపు 15 వేల మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాకాసి అలలు జపాన్ను ముంచెత్తడంతో ఇండ్లు, వాహనాలు కాగితపు పడవలుగా మారి కొట్టుకుపోయాయి. దాదాపు పది రోజులపాటు జపాన్ ప్రజలు తినడానికి సరైన తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోయారు.
జపాన్ తూర్పు ద్వీపకల్పంలోని ఓషికాకు 70 కిలోమీటర్ల దూరంలో 2011 లో సరిగ్గా ఇదే రోజున రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 24 కిలోమీటర్ల లోతులో ఉన్నది. ఈ బలమైన భూకంపం ఈశాన్య జపాన్ను వణికించింది. దాదాపు 20 నిమిషాల తర్వాత సునామీ అలలు ఉత్తరాన హక్కైడో, దక్షిణాన ఒకినావా దీవులను తాకాయి. దీంతో విస్తృతమైన విధ్వంసం ఏర్పడింది. ఈ సమయంలో 15,000 మందికి పైగా మరణించారు. జాతీయ పోలీసు ఏజెన్సీ ప్రకారం, ఇంకా దాదాపు 2,000 మందికి పైగా గల్లంతయ్యారు. ఇది జపాన్లో ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా నిలిచింది. 1900 లో ఆధునిక రికార్డ్ కీపింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచంలో నాలుగో అత్యంత శక్తివంతమైన భూకంపంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
సునామీతో భారీ అలలు ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్ను తాకాయి. అణు కర్మాగారంలోకి ఉప్పునీరు ప్రవేశించినప్పుడు, రియాక్టర్లు కరిగిపోవడం, పేలడం ప్రారంభమయ్యాయి. ప్లాంట్ నుంచి భారీ మొత్తంలో రేడియోధార్మిక మూలకాలు లీక్ కావడం మొదలయ్యాయి. అణు రేడియేషన్ ప్రారంభమైంది. ఫలితంగా జపాన్ తన అణు విద్యుత్ కేంద్రాలన్నింటినీ మూడేండ్లపాటు మూసివేసింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..