బోధన్, మే 3: బోధన్ మున్సిపల్ 18వ వార్డు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కర్రోళ్ల గంగారాం అలియాస్ బెంజర్ గంగారాం ఘన విజయం సాధించారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో బెంజర్ గంగారాం తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ అలియాస్ చిత్రాల చిన్నాపై 175 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని మొత్తం 1,213 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 14 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాగా, మిగతా ఓట్లు పోలింగ్ కేంద్రాల్లో పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి బెంజర్ గంగారామ్కు 510 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్కు 335 ఓట్లు, ఎంఐఎం అభ్యర్థి మదారి లక్ష్మికి 221 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దండు పెద్ద లాలయ్యకు 132 ఓట్లు వచ్చాయి. 13 ఓట్లు చెల్లలేదు. ‘నోటా’కు 2 ఓట్లు పడ్డాయి.
ఓట్ల లెక్కింపు జరిగిందిలా..
సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 10 గంటలకల్లా ముగిసింది. ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మొత్తం 14 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, టీఆర్ఎస్ అభ్యర్థి బెంజర్ గంగారామ్కు 12 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్కు 2 బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులకు ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు పడలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను మూడు రౌండ్ల లో లెక్కించారు.
మొదటి రౌండ్లో 500 ఓట్లను లెక్కించగా.. టీఆర్ఎస్కు 191 ఓట్లు, కాంగ్రెస్కు 148 ఓట్లు, ఎంఐఎంకు 62 ఓట్లు, బీజేపీకి 91 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో ఏడు ఓట్లు చెల్లలేదు. ఒక ఓటు ‘నోటా’కు వచ్చింది. రెండో రౌండ్లో మరో 500 ఓట్లను లెక్కించగా.. టీఆర్ఎస్కు 235 ఓట్లు, కాంగ్రెస్కు 113 ఓట్లు, ఎంఐఎంకు 53 ఓట్లు, బీజేపీకి 94 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో నాలుగు ఓట్లు చెల్లలేదు. ఒక ఓటు ‘నోటా’కు పడింది. రెండు రౌండ్లలో లెక్కించగా మిగిలిన 199 ఓట్లను మూడో రౌండ్లో లెక్కించగా.. టీఆర్ఎస్కు 72 ఓట్లు, కాంగ్రెస్కు 72 ఓట్లు, ఎంఐఎంకు 17 ఓట్లు, బీజేపీకి 36 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లుబాటుకాలేదు. చివరి రౌండ్లో ‘నోటా’కు ఓట్లు రాలేదు. అనంతరం వార్డు ఎన్నికల అధికారి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. గెలుపొందిన బెంజర్ గంగారామ్కు బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, మున్సిపల్ కమిషనర్ రామలింగం సమక్షంలో ఎన్నికల అధికారి శ్రీనివాస్రావు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
ఎమ్మెల్యే షకీల్ ఆశీస్సులతోనే ఈ గెలుపు..
బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహైల్ ఆశీస్సులతో పాటు ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యే తండ్రి ఆజాం సార్ ఆశీస్సులతోనే తాను 18వ వార్డు ఎన్నికలో విజయం సాధించానని టీఆర్ఎస్ అభ్యర్థి బెంజర్ గంగారాం అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటికి వచ్చిన గంగారాం మీడియాతో మాట్లాడారు. తనకు టిక్కెట్ ఇచ్చిన ఎమ్మెల్యే షకీల్, ఆయన సోదరుడు సోహైల్కు కృతజ్ఞతలు తెలుపుతూ.. టీఆర్ఎస్ పట్టణ నాయకులు, కార్యకర్తలు తన గెలుపునకు ఎంతో కృషిచేశారన్నారు. టీఆర్ఎస్పై వార్డు ప్రజలు ఆదరాభిమానాలు చూపిస్తున్నారనడానికి తన గెలుపే నిదర్శనమన్నారు. పార్టీ నాయకత్వం మార్గదర్శకత్వంలో వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు.
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల విజయోత్సవం..
బోధన్ పట్టణం 18వ వార్డులో టీఆర్ఎస్ విజ యం సాధించడంతో టీఆర్ఎస్ పట్టణ నాయకు లు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నా రు. ర్యాలీలపై నిషేధం ఉండడంతో వారు స్వీట్లను పంచుతూ, గెలుపొందిన అభ్యర్థి బెంజర్ గంగారామ్నకు సన్మానాలు చేస్తూ ఈ విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ విజయోత్సవంలో టీఆర్ఎస్ బోధన్ పట్టణ నాయకుడు వేంకటేశ్వరరావు దేశా య్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్ తూము శరత్రెడ్డి, సత్యనారాయణ (స త్యం), టీఆర్ఎస్ నాయకులు జాడె సతీశ్, చం దు, నక్క లింగారెడ్డి, గుండేటి రాములు, వార్డు ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.