ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒక్కడే కదా. అలాంటి వాళ్లు మరింత మంది ఉంటే? ప్రపంచం మరింత మారిపోతుందనేది చాలా మంది వాదన. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ కంపెనీ కూడా నమ్మిందట. అందుకే మస్క్ తండ్రి దగ్గరకెళ్లి ఆయన వీర్యదానం చేస్తే.. మరింతమంది మస్క్లను తయారుచేస్తామని కోరిందట. ఈ విషయాన్ని ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ ఇటీవల వెల్లడించారు.
‘‘కొలంబియాకు చెందిన ఒక కంపెనీ ఈ ప్రపోజల్ చేసింది. హై క్లాస్ కొలంబియా మహిళలను తల్లులను చేయడానికి నా వీర్యం అడిగారు. దీనికి కారణం ఏంటని అడిగితే.. అసలు ఎలన్ మస్క్ను పుట్టించిన వాడుండగా, ఎలన్ దగ్గరకు వెళ్లడం ఎందుకు? అన్నారు’’ అని ఎర్రోల్ తెలిపారు.
ఇలా చేసినందుకు తనకేం డబ్బులు ఇస్తామని చెప్పలేదని, కాకపోతే ఫైవ్ స్టార్ హోటల్స్లో అకామడేషన్, ఫస్ట్ క్లాస్ ట్రావెల్ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారని వివరించారు. దీనికి మీరు ఒప్పుకుంటారా? అని ప్రశ్నిస్తే.. ‘‘ఎందుకు ఒప్పుకోను? అసలు భూమ్మీద మనుషులు ఉన్నదే పిల్లలను కనడానికి.
అలాంటప్పుడు నేను ఇంకో బిడ్డ పుడతానంటే ఎందుకు కాదంటాను?’’ అని అడిగారు. కొన్ని రోజుల క్రితమే తన స్టెప్-డాటర్తో కూడా తనకు సంబంధం ఉందని, ఆమెతో కలిసి ఒక బిడ్డకు జన్మనిచ్చానని సంచలన విషయం వెల్లడించిన ఎర్రోల్ పతాక శీర్షికలెక్కిన సంగతి తెలిసిందే.