న్యూఢిల్లీ : గత నెలలో కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 200 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదిని ఐదేండ్ల కిందట ఢిల్లీలో అరెస్ట్ చేసి ఆపై ఆప్ఘనిస్ధాన్కు తరలించారని ఉగ్ర సంస్థ ఐసిస్-కే వెల్లడించింది. భారత్లో దాడికి ప్లాన్ చేసిన క్రమంలో ఉగ్రవాది అబ్దుర్ రెహ్మాన్ లొగారిని ఢిల్లీలో అరెస్ట్ చేశారని ఉగ్రవాద సంస్ధ తన మ్యాగజైన్లో రాసుకొచ్చింది.
కశ్మీర్ విషయంలో ప్రతీకార దాడి చేప్టటేందుకు భారత్కు వచ్చిన ఐఎస్-కే ఆత్మాహుతి దళ సభ్యుడు అబ్దుర్ రెహ్మాన్ను ఐదేండ్ల కిందట ఢిల్లీలో అరెస్ట్ చేసి ఆప్ఘనిస్ధాన్కు తరలించారని ఐసిస్-కే తన మ్యాగజైన్ వాయిస్ ఆఫ్ హింద్ 20వ ఎడిషన్లో పేర్కొందని సీఎన్ఎన్ జర్నలిస్ట్ సలీం మెహ్సుద్ ట్వాట్ చేశారు. ఈ కధనం ప్రకారం లొగారిని భారత భద్రతా దళాలు 2016లో అరెస్ట్ చేశాయి. కాగా ఈ విషయాన్ని ఇప్పటివరకూ భారత్ అధికారులు, భద్రతా దళాలు నిర్ధారించలేదు.