హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించారు. వార్డులు సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాలు వేసుకున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈనెల 10 నుంచి 12 తేదీల్లో రెండో డోస్ కొవిడ్ తీసుకునే వారికి వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రెండో డోస్ తీసుకోవచ్చని తెలిపారు.
త్వరలో దవాఖానలోని వంద పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. సీఎం ఆదేశాలతో మరో 120 పడకలు సిద్ధం చేస్తున్నట్లు సీఎస్కు అధికారులు చెప్పారు.
మూడు వారాల్లో పడకలు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోగులకు అందుతున్న సేవల పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖాన సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, వైద్యులను ఆయన అభినందించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.