కాబూల్: (Taliban) ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆత్మాహుతి దళాల ప్రత్యేక బెటాలియన్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బెటాలియన్కు లష్కరే-మన్సూరి (మన్సూర్ ఆర్మీ) అని పేరుపెట్టినట్లుగా తెలుస్తున్నది. దేశ సరిహద్దులకు ప్రత్యేకంగా బడాఖాన్ ప్రావిన్స్లో మోహరించనున్నట్లు వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈశాన్య ప్రావిన్స్ బడాఖాన్ వద్ద తజికిస్తాన్, చైనా సరిహద్దులో ఆత్మాహుతి దళాల బెటాలియన్ ఏర్పాటు గురించి అక్కడి ఉన్నత స్థాయి వ్యక్తులు చెప్పినట్లు వార్త నివేదకలు వచ్చాయి.
తజికిస్తాన్, చైనా వైపు సరిహద్దులో తాలిబాన్ ప్రత్యేక ఆర్మీని మోహరించింది. ఈ ప్రత్యేక ఆర్మీ బెటాలియన్ ఆత్మాహుతి దళాలుగా పనిచేస్తాయని తెలుస్తున్నది. మన్సూర్ ఆర్మీగా పిలుస్తున్న ఈ ప్రత్యేక బెటాలియన్ దేశ సరిహద్దుల్లో మోహరిస్తామని బడాఖాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ ముల్లా నిసార్ అహ్మద్ అహ్మదీ చెప్పినట్లుగా వార్తలు అందుతున్నాయి. గత ఆఫ్ఘన్ ప్రభుత్వ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడేవి ఈ బెటాలియనే అని ఆయన అన్నట్లు తెలుస్తున్నది. ఈ బెటాలియన్ లేకపోతే అమెరికాకు ఓటమి సాధ్యమయ్యేది కాదని, ఈ ధైర్యవంతులు పేలుడు పదార్థాలను నడుం ప్రాంతంలో ధరించి పహారా కాస్తారని చెప్పినట్లు సమాచారం.
లష్కరే-మన్సూరితో పాటు బద్రి 313 అనే మరో బెటాలియన్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోహరించబడిన అత్యంత ఆధునిక సైనిక సమూహాలలో ఒకటి. ఖామా ప్రెస్ ప్రకారం, బద్రి 313 కూడా అన్ని ఆత్మాహుతి బాంబర్లతో నిండి ఉంటుంది.
ప్రపంచ ఫార్మసీగా భారత్ అవతరణ : సౌమ్య స్వామినాథన్
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
భారత్లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఈశాన్యంలో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు
తైవాన్లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు
రాజస్థాన్లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..