ముంబై: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ 2007లో ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన తాజ్మహల్ను విజిట్ చేశారు. ఈ టూర్ను ఇవాళ మస్క్ గుర్తు చేసుకున్నారు. తాజ్మహల్ ప్రపంచంలో ఓ అద్భుత కట్టడమని ఆయన తన ట్విట్టర్లో కామెంట్ చేశారు. ట్విట్టర్ సంస్థను టేకోవర్ చేసుకుంటానని చెబుతున్న మస్క్ ఓ ట్వీట్కు రిప్లై ఇచ్చారు. ఆగ్రా ఫోర్ట్లో ఉన్న పాలరాతి కట్టడాలకు చెందిన ఆ అర్కిటెక్చర్ అద్భుతంగా ఉందంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్కు మస్క్ స్పందిస్తూ.. ఆ ఫోర్ట్ అందాలు అమోఘమన్నారు. 2007 ఇండియా టూర్లో తాజ్ మహల్ను విజిట్ చేశానని, ఆ కట్టడం అద్భుతంగా ఉందని మస్క్ తన ట్విట్టర్లో చెప్పారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే మస్క్ మరోసారి ఇండియాలో టూర్ చేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
It is amazing. I visited in 2007 and also saw the Taj Mahal, which truly is a wonder of the world.
— Elon Musk (@elonmusk) May 9, 2022