జెరూసలెం : ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా సాయుధ మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర పోరు ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఇరు పక్షాల మధ్య యుద్ధం బుధవారం 18వరోజుకు చేరింది. గాజా స్ట్రిప్లో భూతల దాడులకు ఇజ్రాయెల్ సంసిద్ధమవుతుండగా వైమానిక దాడులు భీకరంగా సాగుతున్నాయి. హమాస్ స్ధావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భద్రతా దళాలు (ఐడీఎఫ్) రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి.
ఇక అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయం (Aleppo airport) లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేపట్టిందని సిరియన్ స్టేట్ టీవీ వెల్లడించింది. అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా మధ్యధరా సముద్రం దిశగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడిందని సిరియన్ సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో ఎయిర్పోర్ట్ రన్వే ధ్వంసమైందని సిరియా మీడియా తెలిపింది.
కాగా, ఇజ్రాయెల్-హమాస్ వార్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం నేపధ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్ధితులు క్షీణించడం, పెద్దసంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తాము వెన్నంటి ఉన్నామనే భరోసా ఇచ్చిన జో బైడెన్ ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. యుద్ధ వ్యూహాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఇజ్రాయెల్ను కోరారు.
Read More :
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు లేవు : ఈఎన్సీ మురళీధర్