ఇస్లామాబాద్ : పాక్ బలూచిస్థాన్ ప్రావిన్స్లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడి చేసుకొని జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందగా.. 20 మంది భద్రతా సిబ్బంది సహా 23 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, నిన్న బలూచిస్థాన్లో భద్రతా సిబ్బంది 11 మంది ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నది. బలూచిస్తాన్ క్వెట్టాలోని బల్లెలి ప్రాంతంలో పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది.
క్వెట్టా డీఐజీ గులాం అజ్ఫర్ మహేసర్ను పేలుడు కారణంగా ట్రక్కు బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిపోయిందని తెలిపారు. పేలుడుకు కనీసం 25 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి సమీపంలో ఆత్మాహుతి బాంబర్ అవశేషాలను గుర్తించామని, ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులు, ముగ్గురు సాధారణ పౌరులు గాయపడ్డారని, ఇద్దరు పోలీసుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.