కరాచీ, సెప్టెంబర్ 29: పాక్లో ఆత్మాహుతి దాడులు.. 57 మంది దుర్మరణం. ఈద్ మిలాదున్ నబీని పురస్కరించుకొని శుక్రవారం బలూచిస్థాన్ రాష్ట్రంలో భారీ సంఖ్యలో జనాలు ఓ మసీదు సమీపంలో గుమికూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 52 మంది మరణించగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.