కొలంబో: ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇవాళ అక్కడ నుంచి సింగపూర్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన రాజపక్స అకస్మాత్తుగా మాల్దీవులకు పారిపోయారు. అయితే లంకలో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో మాల్దీవులు కూడా సురక్షితం కాదని గ్రహించిన రాజపక్స .. సింగపూర్కు వెళ్లనున్నట్లు తాజా సమాచారం. రాణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించడంతో లంకలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. లంకేయులు ఎక్కడ తనపై దాడి చేస్తారో అన్న ఉద్దేశంతో మాల్దీవుల నుంచి ప్రత్యేక జెట్లో సింగపూర్కు వెళ్లేందుకు రాజపక్స ప్రయత్నాలు చేపట్టారు. ప్రైవేట్ జెట్ను ఏర్పాటు చేయాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గొటబాయ నుంచి రాజీనామా లేఖ అందలేదని పార్లమెంట్ స్పీకర్ తెలిపారు.