SriLanka in China net | ఒకవైపు కరోనా సంక్షోభం.. మరోవైపు పీకల్లోతు అప్పుల ఊబి.. పన్నుల్లో భారీ కోత.. ఫలితంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక మళ్లీ డ్రాగన్ శరణుజొచ్చింది. తాజాగా అత్యవసర మద్దతు కోసం 100 మిలియన్ డాలర్ల సాయం కోరింది. ఈ సంగతిని ఆదివారం శ్రీలంక ఆర్థికశాఖ వెల్లడించింది. శ్రీలంకకు చైనా మద్దతుతో పని చేస్తున్న ఏషియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సాయం చేయనున్నది. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులకు విదేశీ మారక ద్రవ్య నిధుల లభ్యత కోసం సాయం చేయాలని శ్రీలంక కోరిందని ఏషియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తెలిపింది.
కరోనాతో శ్రీలంక పర్యాటక రంగం దెబ్బ తినడం, ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతోపాటు ప్రజలను మభ్య పెట్టేందుకు పలు పన్నుల్లో కోత విధిస్తూ అధ్యక్షుడు గోటబయా రాజపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి చిక్కుకుంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 50 మిలియన్ల డాలర్ల కంటే దిగువకు పడిపోయాయని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సాబ్రీ గత వారం చెప్పారు.
ఫలితంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫుడ్, ఇంధనం, ఔషదాల కొరత తీవ్రమైంది. ఫలితంగా నెల రోజులకుపై పగా శాంతియుతంగా నిరసనలకు దిగారు. గత ఐదు వారాల్లో రాజపక్ష దేశంలో రెండోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆసియా వ్యాప్తంగా మౌలిక వసతులను పురోభివృద్ధి చేయడానికి ఏఐఐబీ 2014లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణ సాయం చేసిన దేశం చైనా. ఇప్పటివరకు చైనాకు 6.5 బిలియన్ డాలర్ల రుణ బకాయి పడింది శ్రీలంక. గత పదేండ్లుగా శ్రీలంకకు చైనా రుణాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.