ది హేగ్: గాజాలో పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతున్నదని దక్షిణాఫ్రికా తీవ్ర ఆరోపణలు చేసింది. వెంటనే సైనిక చర్యను నిలిపివేసేలా ఇజ్రాయెల్ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యా యస్థానాన్ని (ఐసీజే) అభ్యర్థించింది.
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధనేరాలకు పాల్పడుతున్నదని దక్షిణాప్రికా చేసిన ఫిర్యాదుపై గురువారం ఐసీజేలో విచారణ మొదలైంది. దక్షిణాఫ్రికా తన వాదనలను వినిపించింది.