ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని పెషావర్లో పారామిలటరీ బలగాల వాహనం సమీపంలో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో (Suicide Blast) ఆరుగురికి గాయాలయ్యాయి. పెషావర్లోని హయాతాబాద్లో ఈ పేలుడు జరగ్గా దీన్ని సూసైడ్ బ్లాస్ట్గా అనుమానిస్తున్నామని పోలీస్ అధికారులు వెల్లడించారని వార్తాసంస్ధ డాన్ తెలిపింది.
క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆధారాలను సేకరించేందుకు బాంబు డిస్పోజల్ బృందాన్ని ఘటనా స్ధలానికి రప్పించారు. కాగా ఈ పేలుడుకు తమదే బాధ్యతని ప్రకటిస్తూ ఇప్పటివరకూ ఏ ఉగ్ర సంస్ధ, గ్రూప్ ముందుకు రాలేదని అధికారులు తెలిపారు.
Read More :