సింగపూర్ సిటీ: సింగపూర్లో మళ్లీ కరోనా కేసులు (Singapore Covid ) పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి చివరి వారంలో కరోనా కేసుల సంఖ్య 28,000లు దాటింది. దీంతో మరో కోవిడ్ వేవ్పై ఆ దేశంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, ఎక్స్బీబీ సబ్వేరియంట్ వల్ల సింగపూర్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా కేసుల్లో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇన్ఫ్లుఎంజా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే ఎప్పటికప్పుడు కొత్త కోవిడ్ వేవ్లు వస్తుంటాయని పేర్కొంది. కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలన్న నిబంధనను సింగపూర్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సడలించింది.
మరోవైపు భారత్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కేసుల నమోదు పది వేలు దాటింది. గత వారం రోజుల కంటే గరిష్ఠంగా మొత్తం 10,158 కేసులు నమోదయ్యాయి. అలాగే 19 కరోనా మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో తొమ్మిది మంది, గుజరాత్ ఇద్దరు, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్, తమిళనాడులో ఒకరు చొప్పున కరోనా వల్ల చనిపోయారు. కేరళలో అదనంగా మరో నాలుగు కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,035కు పెరిగింది. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం వంటి నిబంధనలను అమలు చేస్తున్నారు.
Also Read: