బీజింగ్: నాసా అంతరిక్ష కేంద్రం తరహాలో .. చైనా కూడా స్పేస్ స్టేషన్(China Space Station) నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అంతరిక్ష కేంద్రానికి డ్రాగన్ దేశం టైకోనాట్స్ను తీసుకువెళ్లింది. ముగ్గురు వ్యోమగాములు ఇవాళ నింగిలోకి ఎగిరారు. లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా.. షెంజూ-16 స్పేస్షిప్ను ఇవాళ చైనా ప్రయోగించింది. వాయవ్య చైనాలో ఉన్న జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి రాకెట్ను నింగిలోకి పంపారు. చైనా కాలమానం ప్రకారం ఉదయం 9.31 నిమిషాలకు రాకెట్ ఎగిరింది. లాంచ్ చేసిన 10 నిమిషాల తర్వాత షెంజూ-16 మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయింది. చైనా స్పేస్ స్టేషన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత టైకోనాట్స్ వెళ్లడం ఇదే తొలిసారి.
మిషన్ కమాండర్ జింగ్ హైపెంగ్, స్పేస్లిఫ్ట్ ఇంజినీర్ జూ యాంగ్జూ, పేలోడ్ నిపుణుడు గుయి హైచావోలు ఇవాళ షెంజూ-16లో స్పేస్ స్టేషన్కు వెళ్లారు. జింగ్ అంతరిక్షంలోకి వెళ్లడం ఇది నాలుగోసారి. షెంజూ-1, షెంజూ-9, షెంజూ-11 మిషన్లలో కూడా ఆయన పాల్గొన్నారు. చివరి రెండు మిషన్లకు కమాండర్గా చేశారు. ఇక టైకోనాట్ జూ ఓ వర్సిటీ టీచర్. ఆయనకు డాక్టరేట్ డిగ్రీ ఉంది. చైనా స్పేస్ స్టేషన్లోకి వెళ్తున్న తొలి ఫ్లయిట్ ఇంజినీర్. బిహంగ్ యూనివర్సిటీలో ఆస్ట్రోనాట్ గుయి ప్రొఫెసర్గా చేస్తున్నారు. పేలోడ్ స్పెషలిస్టుగా ఆయన స్పేస్ స్టేషన్కు వెళ్తున్నారు. దాదాపు అయిదు నెలల పాటు షెంజూ-16 .. చైనా స్పేస్ స్టేషన్తో అనుసంధానమై ఉంటుంది.
Marking the first manned space mission after China's space station entered its application and development phase, the Shenzhou-16 spacecraft carrying three taikonauts was successfully launched onboard a Long March-2F carrier rocket at 9:31 am on Tuesday from the Jiuquan Satellite… pic.twitter.com/ap8CqqSXHF
— Global Times (@globaltimesnews) May 30, 2023
Read More..
Shanghai: మండుతున్న షాంఘై.. వందేళ్ల రికార్డు బ్రేక్