జెనీవా, మే 29: కరోనా మహమ్మారి కన్నా సరికొత్త వైరస్ ప్రపంచంపై దాడిచేయబోతున్నదని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలని చెప్పారు. రాబోయే మహమ్మారిని డిసీజ్-ఎక్స్గా డబ్ల్యూహెచ్వో నిపుణులు తాజాగా పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి కన్నా అత్యంత ప్రమాదకరమైనదిగా దీనిని వారు భావిస్తున్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా మనుషులకు అంతుబట్టని వ్యాధి సోకే అవకాశముంది. దీనినే డిసీజ్-ఎక్స్గా పిలుస్తున్నా’మని డబ్ల్యూహెచ్వో నిపుణులు ఓ బ్లాగ్లో పేర్కొన్నారు. జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు సోకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డిసీజ్-ఎక్స్ ఇప్పటివరకూ ఏ దేశంలోనూ ఏ ఒక్కరిలోనూ బయటపడలేదని వారు పేర్కొన్నారు.