బీజింగ్: చైనాలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో షాంఘైలో కొత్త రికార్డు నమోదు అయ్యింది. గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆ సిటీలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం నాడు జుజియావూ స్టేషన్లో అత్యధికంగా 36.1 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. మధ్యాహ్నం వేళ షాంఘైలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. గతంలో మే నెలలో షాంఘైలో అత్యధికంగా 35.7 డిగ్రీలు నమోదు అయ్యింది. 1876, 1903, 1915, 2018 సంవత్సరాల్లో ఆ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.