Shanghai Lockdown | చైనాలో అత్యధిక జనాభా ఉన్న నగరం.. ఆ దేశానికి ఫైనాన్సయల్ హబ్.. అదే షాంఘై. తాజాగా రోజువారీ కోవిడ్-19 కేసులు 4,400కి పైగా నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ నిబంధనలు కట్టుదిట్టం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు ఇండ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. ఇతరులనూ కరోనా -19 టెస్ట్ల కోసమే బయటకు అనుమతిస్తున్నారు. 2.6 కోట్ల మంది గల షాంఘై నగరాన్ని రెండు భాగాలు విభజించారు అధికారులు. తూర్పు ఫైనాన్సియల్, ఇండస్ట్రీయల్ డిస్ట్రిక్ పొడొంగులో ప్రజలను కోవిడ్-19 టెస్ట్లు చేయించుకోవడానికి మాత్రమే బయటకి రానిస్తున్నారు.సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 4,381 మందికి పాజిటివ్ అని రాగా, 96 మందిలో ఎటువంటి లక్షణాలు లేవు.
అత్యంత అంటు వ్యాధి కారక ఒమిక్రాన్ వేరియంట్ను కట్టడి చేయడానికి షాంఘైలో చైనా జీరో-కోవిడ్ వ్యూహం చేపట్టింది. అందులో భాగంగా పరీక్షలు నిర్వహిస్తూ కదలికలపై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.
హౌవాంగ్పు జిల్లాలోని తూర్పు ప్రాంతంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించినా సోమవారం వరకు ఇరుగు పొరుగు వారిండ్ల మధ్య రాకపోకలను అనుమతించింది. కానీ, మంగళవారం నుంచి ఇరుగు, పొరుగు ఇండ్లకు వెళ్లేందుకు కూడా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. సోమవారం వరకు పిల్లలు సరదాగా గడిపేందుకు పిక్నిక్లకు వెళ్లారని ఓ వ్యక్తి చెప్పారు. ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ హెల్త్ కమిషన్ అధికారి వూ క్వియాన్యూ అభ్యర్థించారు. సోమవారం నాటికి 82.6 లక్షల మందికి కోవిడ్-19 టెస్ట్లు నిర్వహిస్తే 17 వేల మందికి పాజిటివ్ అని తేలిందన్నారు.
లాక్డౌన్లో లుజియాజుయి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సేవలను నిలిపేశారు. ఆమోదం లేని వాహనాలను వీధుల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్లోకి కీలక విభాగాల్లో మాత్రమే సిబ్బందిని అనుమతి ఇస్తున్నారు. అత్యధికులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చారు. ఇక జనరల్ మోటార్స్ జాయింట్ వెంచర్ సంస్థ ఉత్పత్తిని కొనసాగించేందుకు సిబ్బందికి ప్రొడక్షన్ యూనిట్లోనే వసతులు కల్పిస్తున్నది. ఇక్కడ నిద్ర పోవాలని కోరుతున్నది. నగరంలోని పశ్చిమ ప్రాంత వాసులు భారీగా నిత్యావసర వస్తువులు కొని పెట్టుకుంటున్నారు.