కొన్ని కంపెనీలు తమ బిజినెస్ను పెంచుకోవడం కోసం.. తమ కంపెనీ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు రకాల మార్కెటింగ్ పద్ధతులను వినియోగిస్తుంటాయి. అందులో యాడ్స్ ప్రధానమైనవి. ఫోటో యాడ్స్, వీడియో యాడ్స్ ద్వారా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే.. ఒక్కోసారి కొన్ని యాడ్స్ వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. తాజాగా సౌత్ కొరియాకు చెందిన అతి పెద్ద డెయిరీ కంపెనీ సియోల్ మిల్క్(Seoul Milk) కూడా అలాగే పప్పులో కాలేసింది.
సియోల్ మిల్క్ తన డెయిరీ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఇటీవల ఓ వీడియో యాడ్ను రూపొందించింది. అందులో మహిళలను ఆవులుగా చూపించారు. కొందరు మహిళలు.. అడవిలో జలపాతాల వద్ద నీళ్లు తాగి.. పక్కనే ఉన్న పచ్చికబయళ్ల మీద యోగా చేస్తుంటారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ అడవిలో ఫోటోలు తీస్తూ వీళ్లను గమనిస్తాడు. దీంతో వాళ్లను సీక్రెట్గా ఫోటోలు తీస్తుంటాడు. ఇంతలో తన చెప్పు కింద ఉన్న చిన్న కట్టె పుల్ల విరిగి శబ్దం వస్తుంది.
ఆ శబ్దం విన్న మహిళలు వెంటనే ఆవులుగా మారిపోతారు. ఆ ఫోటోగ్రాఫర్ ఇలా కిందికి చూసి పైకి చూసే సమయానికి అక్కడ మహిళలు కనిపించరు.. ఆవులు ఉంటాయి. దీంతో అతడు షాక్ అయిపోతాడు. ఈ యాడ్ను సియోల్ మిల్క్ కంపెనీ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది.
అయితే.. ఈ యాడ్పై సౌత్ కొరియా వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆ వీడియోపై ఫైర్ అవుతున్నారు. మహిళలను ఆవులుగా చూపించడం ఏంటంటూ కొందరు వ్యతిరేకిస్తుండగా.. మహిళలను అలా సీక్రెట్గా వీడియో, ఫోటోలు తీయడం నేరం అంటూ మరో వర్గం వ్యతిరేకిస్తుంది.
సౌత్ కొరియా వ్యాప్తంగా ఈ యాడ్పై చర్చలు నడుస్తుండగా.. యాడ్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాగా.. వెంటనే సియోల్ మిల్క్ డెయిరీ కంపెనీ ఆ యాడ్ను వెంటనే తొలగిస్తున్నట్టు ప్రకటించి.. సౌత్ కొరియా ప్రజలకు క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ.. అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న కోతికి సీపీఆర్.. క్యాబ్ డ్రైవర్పై ప్రశంసలు
బొద్దింకలతో బీరు తయారీ.. క్యూ కడుతున్న బీరు లవర్స్.. ఎక్కడో తెలుసా?