లండన్, సెప్టెంబర్ 9: బ్యాక్టీరియాతో విద్యుత్తును ఉత్పత్తి చేసే అద్భుత సాంకేతికతను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అది కూడా వృథా నీటి నుంచే కరెంటును విజయవంతంగా ఉత్పత్తి చేశారు. జన్యుక్రమంలో మార్పులు చేసిన ఈకోలీ బ్యాక్టీరియాను వేస్ట్ వాటర్ (మురికినీరు)లో పెంచి, దాని నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టు లాసాన్నేలోని ఈపీఎఫ్ఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బొఘోసియన్ ప్రకటించారు. అదికూడా నీటిలో ఎలాంటి కెమికల్స్ కలుపకుండానే విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టు వెల్లడించారు. తాము ఆవిష్కరించిన సాంకేతితతో మురికి నీటిని శుద్ధిచేస్తూ అదే సమయంలో ఎక్స్ట్రాసెల్యులార్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ (ఈఈటీ) విధానంలో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.