World Bank on Covid-19 | కరోనా మహమ్మారితో విద్యావ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నది. కోవిడ్-19 కేసులు పెరుగకుండా నివారించేందుకు స్కూళ్ల మూసివేతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ప్రపంచబ్యాంక్ విద్యా విభాగం డైరెక్టర్ జేమీ సావెద్రా హెచ్చరించారు. పాఠశాలల మూసివేతను సమర్థించుకోలేం అని స్పష్టం చేశారు. ఇప్పటికీ పలు దేశాల్లో విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరు కాలేకపోతున్నారు. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే తుది నిర్ణయంగా స్కూళ్ల మూసివేత ఉండాలనని సావెద్రా ఏర్కొన్నారు.
బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ను తెరిచి పాఠశాలలను మూసేయడంలో అర్థం లేదని జేమీ సావెద్రా వ్యాఖ్యానించారు. పాఠశాలలు తిరిగి తెరుస్తే కోవిడ్ కేసులు పెరుగుతాయనడానికి ఆధారాల్లేవన్నారు. పబ్లిక్ పాలసీ ప్రకారం పిల్లలకు టీకా వేసే వరకు వేచి ఉండాలనడం సమంజసం కాదూ.. అందుకు ఏ శాస్త్రీయ కోణం కూడా లేదని వివరించారు. పిల్లలపై మహమ్మారి ప్రభావం తక్కువేనని పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. ఒకదేశంలో దీర్ఘకాలంగా పాఠశాలల మూసివేతతో భవిష్యత్లో 400 బిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో బీటెన్/ బ్రోకెన్? ఇన్ఫార్మాలిటీ: దక్షిణాసియాలో కరోనా అన్న అంశంపై ప్రపంచబ్యాంక్ విద్యావిభాగం ఓ నివేదిక రూపొందించింది.