ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి యూకే సాయుధ దళాల మంత్రి జేమ్స్ హెప్పే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో రష్యా దళాలు వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాల)కు పాల్పడుతున్నాయని యూరప్ దేశాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక వార్తా సంస్థతో మాట్లాడిన హెప్పే.. ఉక్రెయిన్లో యుద్ధ నేరాలు చేసినందుకు కేవలం రష్యా అత్యున్నత పాలకులనే కాకుండా, మిలటరీ కమాండర్లను కూడా బాధ్యులు చేస్తామని ఆయన చెప్పారు.
‘‘రష్యా కమాండర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధ నేరాలను కేవలం పైన ఉన్న అధినేతలు మాత్రమే చేసినట్లు కాదు’’ అని హెప్పే తెలిపారు. కమాండ్ లైన్లో చిట్టచివరి అధికారి వరకూ అందరూ ఈ వార్ క్రైమ్స్కు పాల్పడినట్లేనని, వాటిని తాము రికార్డు చేస్తున్నామని, ఆయా వ్యక్తులను సదరు నేరాలకు బాధ్యులుగా లెక్కిస్తామని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్లో సాధారణ పౌరులు నివసించే ప్రాంతాలపై రష్యా బాంబుల వర్షం కురిపించిందని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే.
చిన్నపిల్లలు ఉండే ఆస్పత్రిపై కూడా రష్యా బాంబులు పడ్డాయని ఉక్రెయిన్ పేర్కొంది. అయితే తాము కేవలం మిలటరీ స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని రష్యా స్పష్టంగా చెప్తోంది. ఈ క్రమంలోనే తమ దేశంలో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ వాదిస్తోంది. ఈ వాదనకు ఈయూ దేశాలు కూడా వత్తాసు పలుకుతున్న సంగతి తెలిసిందే.