ఈ ఏడాది జీ20 సమావేశం ఇండోనేషియా వేదికగా జరగనుంది. దీనిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా పాల్గొంటారని కొన్నిరోజుల క్రితం ఇండోనేషియాలో రష్యా రాయబారి వెల్లడించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘అగ్రరాజ్యం అమెరికా యుద్ధ నేరాలు చేశాడని అంటున్న వ్లాదిమిర్ పుతిన్తో కలిసి కూర్చోవడం అంటే.. అది చాలా దూరం వెళ్తుంది. నా వల్ల కాదనే అనుకుంటున్నా’’ అని మోరిసన్ అన్నారు. కొన్నిరోజుల క్రితం రష్యాను జీ20 నుంచి తొలగించాలని పలుదేశాలు డిమాండ్ చేశాయి.
అయితే ఏ సభ్య దేశమూ మరో సభ్య దేశాన్ని జీ20 నుంచి తొలగించలేదని, అది జరగని పని అని చైనా స్పష్టంగా చెప్పేసింది. ఈ క్రమంలో జీ20 సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది.