కీవ్, మే 16: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మంగళవారం తెల్లవారుజామున రష్యా భారీ దాడికి పాల్పడింది. అయితే భూ, జల, వాయు మార్గాల ద్వారా క్రెమ్లిన్ సేనలు ప్రయోగించిన 18 డ్రోన్ క్షిపణులను సమర్థంగా కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు. క్షిపణుల శిథిలాల కారణంగా కొన్ని కార్లు కాలిపోయాయని కీవ్ మేయర్ క్లిచ్కో తెలిపారు. ఈ నెలలో కీవ్పై రష్యా దాడి చేయడం ఇది ఎనిమిదోసారి. రష్యా దాడుల నేపథ్యంలో సైన్య సహాయం కోసం యూరోపియన్ యూనియన్లో(ఈయూ) పర్యటిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని స్వదేశానికి పయనమయ్యారు.