కీవ్, జనవరి 1: కొత్త సంవత్సరం మొదటిరోజు భీకరమైన దాడులతో ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. 90-షాహెడ్ తరహా డ్రోన్లతో బాంబుల మోత మోగించింది. ఇకపై మరిన్ని భీకర దాడులు ఉంటాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి హెచ్చరించారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా పుతిన్ సోమవారం ఓ మిలటరీ దవాఖానను సందర్శించారు. రష్యా సరిహద్దు నగరం బెల్గోరాడ్పై శనివారం నాటి ఉక్రెయిన్ దాడులను పుతిన్ ‘ఉగ్రవాద చర్య’గా పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగి 22 నెలలు అ వుతున్నది. బెల్గోరాడ్పై ఉక్రెయిన్ దాడి లో 25 మంది చనిపోవటంతో రష్యా ఆగ్రహంతో ప్రతీకార దాడులకు దిగింది. ఉక్రెయిన్ నగరాలు, కీవ్లోని మిలటరీ కేంద్రాల్ని టార్గెట్ చేస్తామని పుతిన్ మరోసారి ప్రకటించారు.