ఉక్రెయిన్తో ఏడు నెలలుగా రష్యా దళాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రష్యా ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వీళ్లందర్నీ మిలటరీకి సేవ చేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. దీంతో తమ తమ కంపెనీల్లో మిలటరీకి వెళ్లే ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసే పనిలో పడ్డాయట ఈ ఎయిర్లైన్స్ కంపెనీలు.
దేశంలోని రిజర్వ్ దళాల్లో కొంత భాగాన్నిఉపయోగించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీచేశారు. ఈ కారణంగానే రష్యాలోని ఐదు ప్రముఖ ఎయిర్లైన్స్, 10 ఎయిర్పోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది కచ్చితంగా మిలటరీలో చేరాలంటూ నోటీసులు అందాయట. ఈ నేపథ్యంలోనే సుమారు ఐదు కంపెనీలు తమ ఉద్యోగుల్లో మిలటరీ సేవల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన వారి జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డాయని సమాచారం.
కాగా, తాజాగా పుతిన్ ప్రసంగిస్తూ రష్యాను, రష్యన్ భూభాగాలను కాపాడుకునేందుకే రిజర్వ్ దళాలను పాక్షికంగా రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. రష్యాను నాశనం చేయడమే పశ్చిమ దేశాల లక్ష్యమని, ఉక్రెయిన్లో శాంతిని స్థాపించడం వాళ్లకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.