(Richard Nixon) తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సవివరణ ఇచ్చుకునేందుకు రిచర్డ్ నిక్సన్ 1952 లో సరిగ్గా ఇదే రోజున ‘చక్కర్’ ప్రసంగం చేశారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి బరిలో నిలిచిన నిక్సన్కు టికెట్ నిరాకరించే పరిస్థితి రావడంతో అమెరికా చరిత్రలో నిలిచిపోయేలా ప్రసంగం చేసి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. అనంతరకాలంలో అమెరికా అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.
1952 నవంబర్ 4 న అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిపేందుకు అంతా సిద్ధమైంది. రిపబ్లికన్ పార్టీ నుంచి డ్వైట్ ఐసన్హోవర్ అధ్యక్ష అభ్యర్థిగా ఉండి.. ఉపాధ్యక్ష పదవికి అప్పటి కాలిఫోర్నియా సెనేటర్గా ఉన్న రిచర్డ్ నిక్సన్ను ఎంచుకున్నాడు. అయితే, ఎన్నికలకు కొన్ని వారాల ముందు న్యూయార్క్ పోస్ట్ పత్రికలో వచ్చిన వార్త అమెరికా రాజకీయాలను షేక్ చేసింది. రిచర్డ్ నిక్సన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రహస్య నిధిని సృష్టించి వాడుకుంటున్నారని వార్త సారాంశం. వార్త ప్రచురితమైన తర్వాత చాలా వివాదం చెలరేగింది. ప్రత్యర్థి పార్టీ సహా మీడియా అంతా నిక్సన్ను చుట్టుముట్టి నిందించడం మొదలుపెట్టాయి. నిక్సన్కు ఉపాధ్యక్ష టికెట్ ఉపసంహరించుకోవాలని ఐసన్హోవర్పై ఒత్తిడి పెరిగింది.
తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు లాస్ ఏంజిల్స్కు వచ్చిన నిక్సన్.. అతి ముఖ్యమైన ప్రసంగం చేసారు. ఈ ప్రసంగం అమెరికన్ చరిత్రలో అత్యంత చర్చించబడిన ప్రసంగాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది. హాలీవుడ్లోని అల్ కెపిటాన్ థియేటర్ నుంచి నిక్సన్ తన వివరణను ప్రజలకు సమర్పించాడు. ఇందులో, ప్రచార నిధి ఖాతా వివరాలను సమర్పించాడు. అలాగే, బ్లాక్ అండ్ వైట్ అమెరికన్ కాకర్ స్పానియల్ డాగ్ – చెకర్ అనే కుక్కను కూడా విరాళంగా అందుకున్నానని తెలిపారు. అమెరికన్ రాజకీయ చరిత్రలో ఇది మొదటి టెలివిజన్ ప్రసంగం. 6 కోట్ల మంది చూసినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈ ప్రసంగంతో ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. దాంతో నిక్సన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యే మార్గం సులభం అయింది. 1961 వరకు అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నిక్సన్.. తర్వాత 1969 నుంచి 1973 వరకు అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.
2018 : దేశ ప్రజలకు ఆరోగ్య బీమాను ప్రారంభించిన ప్రధాని మోదీ
2016 : 36 రాఫేల్ జెట్ ఫైటర్ల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్న భారతదేశం
2009 : ఒకేసారి ఏడు శాటిలైట్లను భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో
2004 : హైతీలో వరదలు, హరికేన్ సంభవించి వేయికిపైగా జనం దుర్మరణం
1998 : కశ్మీర్ అంశంపై చర్చించేందుకు సమావేశమైన భారత్-పాక్ ప్రధానులు వాజపేయి, షరీఫ్
1965 : భారతదేశం-పాకిస్తాన్ మధ్య ముగిసిన యుద్ధం
1929 : బాల్య వివాహ నిరోధక బిల్లు (శారదాచట్టం)కు భారత్ ఆమోదం
1803 : ఆసే యుద్ధంలో మరాఠాలను ఓడించిన బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..