UAE : అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దేశాలు సంయుక్తంగా దాడిచేసి తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ని హతమార్చడంపై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతున్నది. ఇజ్రాయెల్ (Israel) తోపాటు తన పొరుగుదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు (Missiles), డ్రోన్ల (Drones) తో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్.. ఇరాన్కు హెచ్చరిక చేశారు.
ఇరాన్ తన తర్కాన్ని వాడాలని, పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని గార్గాష్ హెచ్చరించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఒక తప్పుడు లెక్క అన్నారు. ఈ చర్య ఇరాన్ను క్లిష్టమైన సమయంలో ఒంటరిని చేసిందని చెప్పారు. ‘మీ యుద్ధం మీ పొరుగువారితో కాదు’ అని వ్యాఖ్యానించారు. తర్కాన్ని వాడి మీ స్థితికి కారణం తెలుసుకోండి. ‘ఒంటరితనం అనే వలయం మరింత ఎక్కువగా విస్తరించకముందే మీ పొరుగువారితో హేతుబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించండి’ అని సూచించారు.