Science News | జ్యూరిచ్: తీవ్రమైన ఒత్తిడి సహా ఇతర మానసిక రుగ్మతలు మెదడులో నరాలను దెబ్బ తీస్తాయన్న సంగతి తెలిసిందే. శాస్త్రీయంగా దీనికి గల కారణాన్ని కనుగొనటంలో స్విట్జర్లాండ్, న్యూయార్క్ పరిశోధకులు ముందడుగు వేశారు. తీవ్రమైన నిరాశ, నిస్పృహలు నాడీ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థలో అసాధారణ మార్పులకు దారి తీస్తున్నదని వీరి పరిశోధన తెలిపింది.
రక్తంలోని తెల్లరక్త కణాల నుంచి వచ్చే ఎమ్ఎమ్పీ-8 అనే ప్రొటీన్..మెదడు నరాలకు చేరుకొని అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తున్నదని పరిశోధకులు చెప్పారు. తీవ్రమైన నిరాశ, ఇతర మానసిక రుగ్మతలకు లోనైన రోగి రక్తంలో ఎమ్ఎమ్పీ-8 ప్రొటీన్ అనూహ్యంగా పెరిగిందన్నారు.