ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా రాజధాని ప్యాంగాంగ్లో రెండు నెలల క్రితం జరిగిన బాంబు పేలుడు దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ను హతమార్చడమే లక్ష్యంగా జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. పేలుడు ఘటన తర్వాతి నుంచి కిమ్కు భద్రతను మరింతగా పెంచారు.
కిమ్ తన భద్రతపై ఆందోళన చెందుతున్నాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థాలను గుర్తించే కొత్త పరికరాలను కిమ్ దిగుమతి చేసుకొన్నట్టు సమాచారం.