ఇస్లామాబాద్ : తీవ్ర నగదు కొరతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ (Pakistan) 364 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకుంది. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేసేందుకు రెండు అమెరికన్ ప్రైవేట్ కంపెనీలతో పాకిస్తాన్ గత ఏడాది ఆయుధ ఒప్పందం చేసుకుందని ఓ వార్తా సంస్ధ వెల్లడించింది.
రావల్పిండిలోని నుర్ ఖాన్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి బ్రిటిష్ మిలటరీ కార్గో విమానం ఐదు సార్లు ఉక్రెయిన్కు ఆయుధాలను చేరవేసిందని బీబీసీ ఉర్ధూ వెల్లడించింది. అయితే ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాలను చేపట్టలేదని పాకిస్తాన్ చెబుతోంది. అమెరికన్ కంపెనీలు గ్లోబల్ మిలిటరీ, నార్త్రాప్ గ్రుమన్కు 155ఎంఎం షెల్స్ విక్రయం కోసం పాకిస్తాన్ రెండు కాంట్రాక్టులపై సంతకాలు చేసిందని బీబీసీ కధనం పేర్కొంది.
ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాలకు సంబంధించి ఈ ఒప్పందాలు గత ఏడాది ఆగస్ట్ 17న ఖరారయ్యాయని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ వార్కు సంబంధించి పాకిస్తాన్ తటస్ధ వైఖరి అవలంభించిందని, తాము ఉక్రెయిన్కు ఆయుధాలను విక్రయించలేదని పాక్ చెబుతోంది. గత ఏడాది ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూలదోసి పాలనా పగ్గాలు చేపట్టిన పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) సంకీర్ణ సర్కార్ హయాంలో ఈ ఒప్పందాలు జరిగాయని సమాచారం.
Read More :
Samoa | భార్య పుట్టిన రోజును మర్చిపోతే ఐదేండ్ల జైలు.. ఎక్కడంటే?