లండన్: బ్రిటన్లో ఓ అరుదైన వ్యాధి శునకాల నుంచి మనుషులకు సోకింది. బ్రిటన్లో ఇప్పటికే ముగ్గురు ఈ వ్యాధి బారినపడ్డారు. బ్రుసెల్లా కెనిస్గా పిలుచుకునే ఈ వ్యాధి సాధారణంగా శునకాలకు వస్తుంది. బ్యాక్టీరియా కారణంగా సోకే ఈ వ్యాధి మనుషుల్లోనూ బయటపడింది. శునకాల స్రవాల ద్వారా మనుషులకు సోకి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.