ఇస్తాంబుల్: తుర్కియే, సిరియాల్లో భూకంపం తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగ్చిలింది. సోమవారం వచ్చిన భూకంపాల వల్ల ఆ రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 4900కు చేరుకున్నది. కేవలం తుర్కియేలోనే 3381 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఆ దేశ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. సుమారు 20,426 మంది గాయపడినట్లు తెలిపారు.
my heart goes out to those in turkey and syria affected by the earthquake, so terrifying and tragic 🙁 pic.twitter.com/6OM0emoOuK
— Shibetoshi Nakamoto (@BillyM2k) February 7, 2023
తుర్కియేలో ఇప్పటి వరకు 11 వేల భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 25వేల మంది ఎమర్జెన్సీ వర్కర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లు జోరుగా సాగుతున్నాయి. గాయపడ్డవారిని తరలించేందుకు 10 నౌకలు, 54 విమానాలు రంగంలోకి దిగాయి.
This is how birds sounded before Earthquake in #Turkey #earthquakeinturkey pic.twitter.com/yAThmFzpCf
— suri! (@suribabupk) February 7, 2023
సిరియాలో మరణాల సంఖ్య 1509గా నమోదు అయ్యింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం, తీవ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో మరణాలు నమోదు అయినట్లు తెలిపారు. సిరియాలో సుమారు 3548 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.