వాషింగ్టన్ : అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దాడులకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కారణమని ఆయన పేరు చెప్పకుండా పరోక్షంగా ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి బెదిరింపులు, రాజకీయ హింసపై వెట్హౌస్లో బైడెన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంపై బెదిరింపులకు దిగుతున్న, రాజకీయ హింసను వ్యాప్తి చేసే వారిని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. అధికారం, లాభం కోసం మాట్లాడే అబద్ధాల ఫలితమే హింస అన్నారు.
ఇదంతా కుట్ర, కోపం, ద్వేషం, హింసను ప్రేరేపించడానికి అబద్ధాలను పదేపదే చెప్పడం ఫలితమన్నామని బైడెన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అబద్ధాలను నిజంతో ఎదుర్కోవాలని, దేశ భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉందని బైడెన్ పేర్కొన్నారు. ఒక దేశంగా గట్టిగా మాట్లాడాలని.. డెమొక్రాట్స్, రిపబ్లికన్ల మద్దతుదారులైనా ఓటర్లపై బెదిరింపులు, రాజకీయ హింసకు అమెరికాలో చోటు లేదని చెప్పాలని పిలుపునిచ్చారు. అయితే, అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై విమర్శలు చేసినట్లుగా భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ నిరాకరించిన విషయం తెలిసిందే.