తుపాకులు తీసుకొని తన వెంట పడిన వారి నుంచి తప్పించుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక చర్చిలో దూరాడా వ్యక్తి. అతని వెంట పడిన వాళ్లు అది పవిత్రమైన స్థలం అని కూడా చూడకుండా కాల్పులకు తెగబడ్డారు. తాము వెంబడించిన వ్యక్తితోపాటు చర్చిలో ఉన్న ఇద్దరు ప్రీస్ట్లను కూడా హతమార్చారు.
అమెరికా సరిహద్దుల వెంబడి మెక్సికోలో జరిగిన ఈ హత్యలను ప్రస్తావించిన పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis).. ఆ ప్రాంతంలో పెరుగుతున్న హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మెక్సికోలో చాలా హత్యలు జరుగుతున్నాయి’’ అన్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ప్రసంగం సందర్భంగా పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మెక్సికోలో జరిగిన హత్యాకాండలో మన సోదరులు ఇద్దరు మరణించడం పట్ల అపారమైన దుఖం వ్యక్తపరుస్తున్నాను’’ అని ఆయన చెప్పారు. హింస వల్ల సమస్యలు సాల్వ్ కావని, కేవలం బాధ మాత్రమే పెరుగుతుందని మరోసారి హితవు పలికారు.