కీవ్: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు ఇతర ప్రధాన నగరాల స్వాధీనానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. కాగా, కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించిన రష్యా దళాలను స్థానిక పోలీసులు, ప్రజలు అడ్డుకుంటున్నారు. ఉక్రెయిన్లోని చెర్నిహివ్లోకి రష్యన్ ట్యాంకుల కాన్వాయ్ ప్రవేశించింది. గమనించిన స్థానిక పోలీసులు, ప్రజలు వెంటనే రోడ్డుపైకి చేరుకున్నారు. ఆ కాన్వాయ్ ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు కీవ్ లక్ష్యంగా బెలారస్ నుంచి ప్రయోగించిన క్షిపణిని తమ వైమానిక దళం కూల్చివేసిందని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్, ఆ దేశ ప్రజలపై జరిగిన మరో యుద్ధ నేరమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో బెలారస్లో చర్చలకు రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది.
కాగా, తమ దేశంపై యుద్ధం కోసం రష్యా సైనికుల మోహరింపునకు బెలారస్ సహకరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో కాకుండా మరే ఇతర దేశాల్లో చర్చలకు తాము సిద్ధమేనని తెలిపారు. వార్సా, బ్రాటిస్లావా, ఇస్తాంబుల్, బుడాపెస్ట్ లేదా బాకు వంటి రాజధానులను చర్చలకు ప్రత్యామ్నాయ వేదికలుగా ఆయన సూచించారు.
In the region of #Chernihiv, police along with local residents stopped a convoy of #Russian tanks. pic.twitter.com/unzwFD2u6l
— NEXTA (@nexta_tv) February 27, 2022