న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఇవాళ ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడనున్నారు. చివరిసారి ఫిబ్రవరి 26వ తేదీన ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషించారు. వేలాది మంది భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో జెలెన్స్కీతో మోదీ మాట్లాడనున్నారు. సుమీ నగరంలో చిక్కుకున్న మెడికల్ విద్యార్థులను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమీకి సమీపంలో ఉన్న పోల్టవా వద్ద అధికారుల బృందం ఆ విద్యార్ధుల కోసం ఉంది. వార్ జోన్లో చిక్కుకున్న విద్యార్థులను తరలించేందుకు అధికారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా బోర్డర్ దిశగా నడిచేందుకు డిసైడ్ అయినట్లు కొందరు విద్యార్థులు వీడియో ద్వారా తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ప్రధాని మాట్లాడనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆపరేషన్ గంగాలో భాగంగా 76 విమానాల్లో 15,920 మంది భారతీయుల్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.